World Economic Forum: ఇండియా లాంజ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ‘నేషన్ ఫస్ట్’..
- ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇండియా లాంజ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- కేంద్ర మంత్రులు, వివిధ సీఎంలు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగం..
- నేషన్ ఫస్ట్ అనే స్పూర్తి చాటేలా టీమ్ ఇండియాగా అంతా కలసి పనిచేద్దామని పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Economic Forum: ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) వేదికగా ఇండియా లాంజ్ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నేషన్ ఫస్ట్’ అనే భావనతో అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిసి టీమ్ ఇండియాగా పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నా, దేశంగా మాత్రం అందరం ఒక్కటేనని స్పష్టం చేశారు.
Read Also: US Iran Tensions: అండర్గ్రౌండ్లోకి ఇరాన్ టాప్ లీడర్.. ట్రంప్ భయమే కారణామా?
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ప్రస్తుతం భారత్ వేగంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని, ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా భారత్ నిలిచిందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయన్నారు. మన దేశానికి బలమైన నాయకత్వం ఉందని, దేశ శక్తి సామర్థ్యాలను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పామని చెప్పారు. అదే సమయంలో పటిష్టమైన వ్యవస్థల రూపకల్పన కూడా జరుగుతోందని పేర్కొన్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా, అందరం భారత్కే ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రాలుగా పోటీ పడుతున్నప్పటికీ, దేశంగా మాత్రం పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతున్నామని సీఎం వివరించారు. సంపద సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళ్తోందో తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వచ్చే రెండేళ్లలో భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2047 నాటికి అగ్రస్థానానికి చేరే లక్ష్యంతో ముందుకు సాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?