టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందిన సురేందర్ రెడ్డి గత కొంతకాలంగా కెరీర్లో బాగా వెనుకబడ్డారు. స్టైలిష్ మేకింగ్ మరియు కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డికి కిక్ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఆ సూపర్ హిట్ సినిమాకు సిక్వీల్ గా వచ్చిన కిక్ –2తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఆ సినిమా అటు నిర్మాతలకు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
Also Read : KING : వెయ్యి కోట్లు వసూళ్లపై కన్నేసిన స్టార్ హీరో
దాంతో లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ చరణ్తో చేసిన ధృవ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కానీ అది ఒక తమిళ సినిమా రీమేక్ కావడంతో పూర్తిగా సురేందర్ రెడ్డి ఒరిజినల్ క్రెడిట్గా చెప్పలేరు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన సైరానరసింహ రెడ్డి సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు పొందినా పాన్ ఇండియా స్థాయిలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేక ప్లాప్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బాంబ్ గా మారింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో సురేందర్ రెడ్డితో సినిమా అంటేనే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి ఒక కొత్త సినిమాను చేయబోతుడు. ఈ కాంబినేషన్ ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో తెరకెక్కే ఈ సినిమా సురేందర్ రెడ్డికి మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వగలదా అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి మళ్ళీ హిట్ కొడతాడా లేదా ప్లాప్స్ కంటిన్యూ చేస్తాడా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
