NTV Telugu Site icon

Whatsapp Update: వాట్సాప్‌ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు వరుస అప్డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ ను తీసుకువచ్చిన ఈ యాప్ ఇప్పుడు మరో అప్డేట్ ను తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో అప్డేట్ ను తీసుకొచ్చింది.. ఈ వాట్సాప్ ను ఇప్పటివరకు 2 మిలియన్ మంది వాడుతున్నారు.. ఇప్పుడు వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్పై పని చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి థర్డ్ పార్టీ యాప్లతో ఛాట్ చేయగలుగుతారు. వాస్తవానికి మెటా తీసుకువచ్చిన ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ థర్డ్ పార్టీ యాప్లతో ఛాటింగ్ ఫీచర్పై పని చేస్తున్నారు..

ఒకసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ నుంచి ఇంకేదైనా మెసేజింగ్ యాప్ కు మెసేజ్ చేసుకొనే వెసులుబాటు ఉంది.. యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం తీసుకొచ్చిన ఒత్తిడితో ఈ ఫీచర్ను మార్చి నాటికే అందుబాటులోకి తీసుకురావచ్చని సోషల్ మీడియాలో ఒక వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ఇంజనీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రోబర్ వాట్సాప్ తన 200 కోట్ల మంది వినియోగదారులకు థర్డ్ పార్టీ యాప్లతో ఛాటింగ్ చేసే సదుపాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది..

ఈ ఫీచర్ మొదట అందుబాటులోకి రాగానే మొదట కేవలం ఫొటోస్,వాయిస్ సందేశాలు, వీడియోలు, ఫైల్‌లను ఒకరికొకరు పంపగలరు. కాల్‌లు, గ్రూప్ చాట్‌లు తర్వాత జోడిస్తారు. వాట్సాప్ ఐ మెసేజ్, టెలీగ్రామ్, సిగ్నల్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా వాట్సాప్‌లో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.. ఈ ఫీచర్ ను ఎంపిక చేసుకున్న వినియోగదారులకు వారి చాట్‌ల ఎగువన ఉన్న ప్రత్యేక థర్డ్-పార్టీ చాట్‌లు ఇన్‌బాక్స్‌లో ఇతర యాప్‌ల నుంచి సందేశాలను చూడవచ్చు. అయితే పరస్పరం పని చేయాలనుకునే కంపెనీలు తప్పనిసరిగా ఒప్పందంపై సంతకం చేయాలంటే వాట్సాప్ నిబంధనలను అనుసరించాలి.. అలాగే ప్రస్తుత క్లయింట్-సర్వర్ ఆర్కిటెక్చర్‌లో రూపొందించిొన పరిష్కారం ద్వారా ఈ విధానాన్ని అందించడానికి ఉత్తమ మార్గం భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తుంది..