What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats today updates 13.10.2022,

1. నేడు మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌. ఉదయం 11 గంటలకు నామినేషన్‌ వేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్‌.

2. నేడు మహిళల ఆసియాకప్‌లో తొలి సెమీ ఫైనల్‌. తొలి సెమీస్‌లో థాయ్‌లాండ్‌తో తలపడనున్న భారత్‌. కాసేపట్లో ప్రారంభంకానున్న మ్యాచ్‌.

3. తెలంగాణలో వీఆర్‌ఏల సమ్మె విరమణ.. నేటి నుంచి విధుల్లో చేరనున్న వీఆర్‌ఏలు. గత 80 రోజులుగా ఉద్యమం చేస్తున్న వీఆర్‌ఏలు. వీఆర్‌ఏల డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం.

4. మునుగోడులో ఓట్ల నమోదుపై బీజేపీ రిట్‌ పిటిషన్‌. నేడు విచారించనున్న తెలంగాణ హైకోర్టు. జూలై 31 వరకు ఉన్న ఓటర్‌ లిస్ట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన బీజేపీ. రేపు ఓటర్‌ లిస్ట్‌ ప్రకటించనున్న ఈసీ.

5. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,000 లుగా ఉంది.

6. హిజాబ్‌ నిషేదాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు హిజాబ్ కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.