Virender Sehwag: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నా వల్ల కాదు బాబోయ్: సెహ్వాగ్
- 2015లో అంతర్జాతీయ క్రికెట్కు సెహ్వాగ్ వీడ్కోలు
- 2017లో హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు
- ఐపీఎల్లో ఆఫర్ వస్తే చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag Interested Coaching An IPL Team: టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఆటగాడిగా ఇప్పటికే 15 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నానని, కోచ్ పదవి చేపడితే మరోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నాడు. ఐపీఎల్ టీమ్ కోచ్గా ఆఫర్ వస్తే మాత్రం వదులుకోనని వీరూ చెప్పాడు. 2017లో టీమిండియా హెడ్ కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అప్పటి సీఏసీ హెడ్ కోచ్గా రవిశాస్త్రిని నియమించింది. ఆ తర్వాత వీరూ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదు.
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరిస్తారా? అనే ప్రశ్న వీరేంద్ర సెహ్వాగ్కు ఎదురైంది. సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టను. ఎందుకంటే నేను భారత జట్టుకు కోచ్గా మారితే మళ్లీ నా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే ఆటగాడిగా 15 ఏళ్ల పాటు ఇంటికి దూరమయ్యా. హెడ్ కోచ్ అయితే మరోసారి ఇదే రిపీట్ అవుతుంది. నాకు 14, 16 సంవత్సరాల పిల్లలున్నారు. ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. ఒకరు ఆఫ్ స్పిన్నర్, మరొకరు ఓపెనింగ్ బ్యాటర్. వారికి నా అవసరం ఉంది. నేను టీమిండియా హెడ్ కోచ్గా వెళ్తే వారిని ట్రైన్ చేయడం కష్టమవుతోంది. ఐపీఎల్లో కోచ్ లేదా మెంటార్ ఆఫర్ వస్తే చేస్తాను’ అని చెప్పాడు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Radhika-Rajinikanth: హేమ కమిటీ రిపోర్ట్.. రజనీకాంత్ వ్యాఖ్యలపై స్పందించిన రాధిక!
15 ఏళ్ల పాటు భారత జట్టుకు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ 2015లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2014, 2015లో పంజాబ్ కింగ్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన వీరూ.. 2016లో అదే జట్టులో కోచింగ్ స్టాఫ్లో మెంటార్గా చేరాడు. ఆపై డైరెక్టర్ ఆఫ్ ది క్రికెటర్గా 2018 వరకు కొనసాగాడు. అప్పటినుంచి వీరూ కోచ్, మెంటార్ పదవికి దూరంగా ఉంటున్నాడు. భారత్ తరఫున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!