Site icon NTV Telugu

Vijay Sethupathi : విజయ్ సేతుపతి.. సాయి పల్లవి.. మణిరత్నం భారీ ప్రాజెక్ట్

Vijay Sethupathi

Vijay Sethupathi

తానదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాపై కోలీవుడ్ లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Also Read : Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?

తాజా సమాచారం ప్రకారం, విజయ్ సేతుపతి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కథను మణిరత్నం తొలుత సిలంబరాసన్ టీఆర్ శింబు కోసం రాసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల STR ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదట. దీంతో అదే కథకు విజయ్ సేతుపతిని హీరోగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి, సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్‌ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత విజయ్ సేతుపతి కెరీర్‌లో ఈ మణిరత్నం  సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రం సేతుపతి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version