టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఇప్పుడు తమ రిసెప్షన్ వేడుకను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లో వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు రావాల్సిందిగా ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు.
Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?
విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రధాని మోదీని కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను ప్రధాని ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు తారలు, దేశ ప్రధానిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఉదయ్పూర్లో కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే పెళ్లి జరగగా, హైదరాబాద్లో జరగనున్న ఈ రిసెప్షన్కు రాజకీయ, సినీ,వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందనే వార్తలతో ఇప్పుడు భాగ్యనగరంలో సందడి మొదలైంది. ప్రధానితో ఉన్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు “నేషనల్ క్రష్ రౌడీ స్టార్ రేంజ్ అంటే ఇది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
