స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, సామాన్యులతో మమేకమవడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన పెళ్లి తర్వాత భార్య రష్మిక మందన్నతో కలిసి తన స్వగ్రామమైన తుమ్మెన్పేట వెళ్లిన విజయ్, అక్కడ ఒక అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. తన గ్రామంలోని కొత్త ఇంట్లో వ్రతం ముగించుకున్న అనంతరం, తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, గ్రామస్థులతో కలిసి విజయ్, రష్మికలు విందు ఆరగించారు.
Also Reaed : Sneha: అప్పుడు మంచానికే పరిమితం అయ్యా.. హీరోయిన్ స్నేహ ఎమోషనల్..!
ఒక స్టార్ కపుల్ ఇలా ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా అందరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ‘మా హీరో అంటే ఇదే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే వీరే’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన సొంత ఊరి పట్ల తనకున్న ప్రేమే కాకుండా, తనను ఆదరించే అభిమానుల పట్ల ఉన్న గౌరవాన్ని విజయ్ ఈ విధంగా చాటుకున్నారు. ఈ పర్యటనలో విజయ్ ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఈ జంట హైదరాబాద్ చేరుకోనుండగా, సాయంత్రం జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
