టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక (Wedding Invitation) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనుందట.
Also Read : Trisha: అనవసర వివాదాల్లోకి లాగితే ఖబర్ధార్.. బీజేపీ నేతపై త్రిష ఫైర్!
ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 04, 2026 (బుధవారం) సాయంత్రం 7 గంటల నుండి హైదరాబాద్లోని ప్రఖ్యాత తాజ్ కృష్ణ (Taj Krishna) హోటల్లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారట. విజయ్ దేవరకొండ తన పేరు మీద (రష్మిక తరపున కూడా) ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తూ, తమ కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి విజయ్ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన ఫోటోలు బయటకు రావడం, ఇప్పుడు ఈ వెడ్డింగ్ కార్డ్ కూడా లీక్ అవ్వడంతో వీరి పెళ్లి వార్త అధికారికంగా ధృవీకరించబడినట్లయింది.