మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ పథకం ఎంతో మంది పేదలకు ఉపాధిని కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ పేరును ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త లోగో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Alsor Read:Arshdeep Singh: డారిల్ మిచెల్కు క్షమాపణ చెప్పా.. నేను కావాలని కొట్టలేదు!
అయితే ఈ లోగో తయారు చేసేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. అంతే కాదు.. ఈ లోగో డిజైన్ చేసినవారిలో విజేతగా నిలిస్తే బహుమతి కింద రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ పోటీలో పాల్గొనే వారు mygov.in వెబ్ సైట్ లో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మార్చి 20 ఈ పోటీకి చివరి తేదీగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు 100 పని దినాలు ఉండేవి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పేరు మార్పుతో పాటు.. పని దినాలను 125 రోజులకు పెంచిన విషయం తెలిసిందే.
