భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేష్బాబు FIDE గ్రాండ్ స్విస్ టైటిల్ ను మాజీ మహిళా ప్రపంచ ఛాంపియన్ టాన్ జోంగీతో జరిగిన చివరి మ్యాచ్ను డ్రా చేసుకోవడం ద్వారా గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇది ఆమెకు వరుసగా రెండో విజయం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ టోర్నమెంట్ను రెండుసార్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంతో, వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ తర్వాత క్యాండిడేట్స్కు అర్హత సాధించిన మూడవ భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
ఈ చారిత్రాత్మక విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ వైశాలి రమేష్బాబును అభినందించారు. ప్రధాని మోదీ తన X హ్యాండిల్లో ‘గొప్ప విజయం. వైశాలి రమేష్బాబుకు అభినందనలు. ఆమె అభిరుచి, అంకితభావం ఆదర్శప్రాయమైనవి. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. దీనితో పాటు, ఓపెన్ విభాగంలో, భారత స్టార్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి తన చివరి గేమ్ను విన్సెంట్ కీమర్తో డ్రా చేసుకున్నాడు. ఈ డ్రా కారణంగా, అతను క్యాండిడేట్స్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విభాగంలో, అనిష్ గిరి, జర్మన్ గ్రాండ్మాస్టర్ మాథియాస్ బ్లూబామ్ క్యాండిడేట్స్కు అర్హత సాధించారు.
Outstanding accomplishment. Congrats to Vaishali Rameshbabu. Her passion and dedication are exemplary. Best wishes for her future endeavours. @chessvaishali https://t.co/0AgnNjRV93
— Narendra Modi (@narendramodi) September 16, 2025