Site icon NTV Telugu

Salman Ali Agha: “మా టీమ్‌కు తారీఖ్ ట్రంప్ కార్డ్‌ లాంటోడు”.. ఉస్మాన్ వివాదంపై పాక్ కెప్టెన్ రియాక్షన్..

Salman

Salman

Salman Ali Agha: ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ మరి కొన్ని గంటల్లో ప్రారభం కానుంది. ఈ మ్యాచ్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే.. ఈ సారి పాకిస్థాన్ టీమ్‌లోని ఓ ప్లేయర్‌పై చర్చలు జోరందుకున్నాయి. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. యువ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్. ఉస్మాన్ స్పిన్నింగ్‌పై ట్రోలింగ్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అనేక మంది ఈ బౌలింగ్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆలీ ఆఘా స్పందించాడు. తారీఖ్ బౌలింగ్‌పై ఎలాంటి సందేహాలకు తావు లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి అయిన ఐసీసీ (International Cricket Council) ఇప్పటికే క్లారిటీ ఇచ్చిందని సల్మాన్ చెప్పాడు. ఉస్మాన్ యాక్షన్ సరైనదే అని, ఆ స్పిన్నర్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశాడు. మ్యాచ్ ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆఘా మాట్లాడుతూ.. “మీడియానే ఉస్మాన్‌ను పెద్ద పేరు వైరల్ అయ్యేలా చేసింది. మా జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లు మాకు సమానమే. ముఖ్యమే. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మా టీమ్‌కు తారీఖ్ ట్రంప్ కార్డ్‌లాంటివాడు. స్పిన్నింగ్‌పై ఐసీసీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిది. మరి ఎందుకు ఈ చర్చ?” అని ప్రశ్నించాడు. ఉస్మాన్ ఈ వివాదాలతో ప్రభావితం కాలేదని, ప్రశాంతంగానే ఉన్నాడని వివరించాడు.

READ MORE: Vijay Devarakonda : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ

కాగా.. 28 ఏళ్ల ఉస్మాన్ తారిఖ్ ఇప్పటివరకు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 11 వికెట్లు తీశాడు. సగటు కేవలం 7.90 మాత్రమే. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు సైతం తీసి తన సామర్థ్యాన్ని చూపించాడు. ఈ టోర్నీలో అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే అతని బౌలింగ్ యాక్షన్‌పై కొంత వివాదం మొదలైంది. బంతి వేయడానికి ముందు క్షణం ఆగి సైడ్ ఆర్మ్ స్టైల్లో వేస్తాడని, అది సరైనది కాదని కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే “చకింగ్” చేస్తున్నాడని అంటున్నారు. ఈ విషయంపై ఆఘా క్లారిటీ ఇచ్చాడు.

READ MORE: Mahashivratri 2026: నేడు ‘మహాశివరాత్రి’.. ‘శివలింగం’ ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రార్థం ఏంటో తెలుసా?

Exit mobile version