Chaina America War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధానికి దిగే అవకాశం ఉందని యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మైఖేల్ మినిహాన్ హెచ్చరించారు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధిపతి మైఖేల్ మినిహాన్ సైనిక సిబ్బందికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తైవాన్లోకి చైనా చొరబాట్లను పెంచడంతో యూఎస్ వైమానిక దళం నుంచి హెచ్చరిక వచ్చింది.
Read Also: Harish Rao: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి.. అభివృద్ధి నివేధిక విడుదల..
2025లో చైనాతో యుద్ధం వస్తుందని తాను భావిస్తున్నానని, అందుకు సిద్ధంగా ఉండాలని సైనికులకు రాసిన లేఖలో ఎయిర్ ఫోర్స్ జనరల్ చెప్పారు. చైనా ఎత్తుగడలను అడ్డుకోవడం, అవసరమైతే వాటిని ఓడించడమే అమెరికా ప్రధాన లక్ష్యం అని కూడా లేఖలో పేర్కొన్నారు. యుద్ధం గురించి హెచ్చరించిన జనరల్ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ వివాదం వివాదాస్పదం అయింది. వెంటనే సీనియర్ సైనిక అధికారులు స్పందించారు.
Read Also: Marriage Fraud: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్.. పెళ్లి పేరుతోనూ పలువురిని మోసం
యూఎస్, తైవాన్ దేశాల్లో 2024లో అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తాయి. ఈ కాలంలో, తైవాన్పై దాడి చేసేందుకు చైనా తన సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేస్తుందని మినిహాన్ లేఖ పేర్కొంది. తైవాన్ జలసంధికి సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు బలపడడం తైవాన్పై దాడికి సంకేతమని తాను అనుమానిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అంతకుముందు ప్రకటించారు. దీని తరువాత, చైనాపై చర్య యుద్ధానికి దారితీయవచ్చని యుఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ లేఖ కూడా వచ్చింది.
General Mike Minihan, who heads the United States Air Force's Air Mobility Command has warned that he believes the United States will be at #war with #China in 2025. pic.twitter.com/q1388TfUWz
— Donald Standeford (@Don_Standeford) January 28, 2023