Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నారు. పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు.. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం.. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు.. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై రైతులు మరో ఆశ పెట్టుకున్నారు. పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచుతుందని. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా రూ. 6 వేలు మాత్రమే అందిస్తుంది. దీనిని రూ. 8 వేలు లేదా 10 వేలకు పెంచాలని ఎప్పటినుంచో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
READ MORE: Sreeleela :పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు!.. అబ్బాయిల డిమాండ్పై శ్రీలీల క్రేజీ పంచ్!
