Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పుఠానీ తండా నుంచి రేపల్లెవాడ వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది సరైన వర్షపాతం నమోదు కాలేదని, ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక సాంప్రదాయ పంటలను సాగు చేసి రైతులు నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు.
సాగునీటి కొరతను తట్టుకుంటూ, ఎలాంటి నష్టాలు లేకుండా దీర్ఘకాలిక ఆదాయాన్ని ఇచ్చే పామాయిల్ సాగు రైతులకు ఒక వరం లాంటిదని చెప్పారు. ముఖ్యంగా గిరిజన రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని, ఇది వారి ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. తమ సొంత పట్టా భూముల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పొంది బోర్లు వేసుకునే గిరిజన రైతులకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఆయన ఆదేశించారు.
Also Read
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
రఘునాథపాలెం మండలానికి రాబోయే రోజుల్లో అభివృద్ధి మహర్దశ పడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న సాగునీటి కలను సాకారం చేస్తూ మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 100 కోట్లతో మారుమూల గ్రామాలు, గిరిజన తండాలు , పొలాలకు సిమెంట్, బీటీ రహదారులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను బాగా చదివించాలని, విద్యతోనే కుటుంబాలలో, సమాజంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!