NTV Telugu Site icon

TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌… ఈ నెల 18న ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు

Ttd

Ttd

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ చెప్పంది. ఈ నెల 18నుంచి ఆన్ లైన్‌ అక్టోబర్ నెల దర్శన టిక్కెట్ల విడుదల చేయనున్నట్లు పేర్కొంది. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు టీటీడీ అధికారులు. రోజు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నప్రసాద సముదాయంలో యంత్రాల ఆధునీకీకరణ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. అటు తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 353 మంది భక్తులు కాగా.. 28, 444 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లుగా నమోదు అయింది.