తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం భక్తులకు జారి చేసే టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఇక, రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. పది రోజులకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో 4. 25 లక్షల టోకేన్లు జారీ చేసేందుకు దేవస్థానం బోర్డు సన్నాహాలు చేపట్టింది. అయితే, ఎల్లుండి నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది.
Read Also: Crime News: ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను చంపిన భర్త! కనిపించట్లేదని డ్రామా
ఇందులో భాగంగానే పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. పది రోజుల పాటు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఎల్లుండి ఉదయం స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇక, 24వ తేదిన వేకువ జామున పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం కొనసాగనుంది. అలాగే, పది రోజుల పాటు టోకెన్ కలిగిన భక్తులుకు మాత్రమే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. ఆన్ లైన్ విధానంలో ఇప్పటికే పూర్తి అయిన ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శన టిక్కెట్లను టీటీడీ విక్రయాలు జరిపింది. అయితే, రేపు మధ్యహ్నం నుంచి ఆఫ్ లైన్ విధానంలో సర్వ దర్శనం భక్తులకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించనుంది.