Today Stock Market Roundup 27-04-23: ‘‘హమారా బజాజ్..’’ అన్న ఇన్వెస్టర్లు
Today Stock Market Roundup 27-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం చెప్పుకోదగ్గ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు క్రమంగా పెరిగాయి. బాగా రాణించిన సంస్థల జాబితాలో బజాజ్ ట్విన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో ముందు వరుసలో నిలిచాయి.
మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్ దగ్గరపడుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బజాజ్ ఫైనాన్స్ సంస్థ క్యూ4లో మంచి పనితీరు కనబరచటం కలిసొచ్చింది. ఆ కంపెనీ షేర్ల విలువ 3 శాతం పెరిగింది. ఎల్టీటీఎస్ స్టాక్ వ్యాల్యూ కూడా 4 శాతం ర్యాలీ తీసింది. కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ పెరగటం ప్లస్ పాయింట్ అయింది.
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
read more: Land Rates in Hyderabad: హైదరాబాద్లో భూముల రేట్లు.. యావరేజ్గా గజం స్థలం ఎంతుందంటే?..
రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ మరియు రియాల్టీ ఇండెక్స్లు సున్నా పాయింట్ మూడు శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు.. నిఫ్టీ మీడియా సూచీ సున్నా పాయింట్ 2 శాతం పడిపోయింది. సెన్సెక్స్ 348 పాయింట్లు పెరిగి 60 వేల 649 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17 వేల 915 వద్ద ఎండ్ అయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 30 సంస్థల్లో ఏకంగా 24 సంస్థలు మెరిశాయి. ఆరు సంస్థలు మాత్రమే చతికిలపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 50 కంపెనీల్లో 15 కంపెనీలు మాత్రమే లాభాల బాట పట్టాయి. మిగతావి వెనకబడ్డాయి. మ్యాన్కైండ్ ఫార్మా సంస్థ చేపట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి మూడో రోజు, చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు 14 పాయింట్ ఒకటీ ఐదు శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ లభించింది.
10 గ్రాముల బంగారం ధర 304 రూపాయలు పెరిగింది. తద్వారా 60 వేల 197 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 587 రూపాయలు పెరిగింది. ఫలితంగా 74 వేల 406 రూపాయల గరిష్ట విలువ పలికింది. క్రూడాయిల్ ధర 128 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 107 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 84 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!