Today Stock Market Roundup 27-04-23: ‘‘హమారా బజాజ్..’’ అన్న ఇన్వెస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 27-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం చెప్పుకోదగ్గ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు క్రమంగా పెరిగాయి. బాగా రాణించిన సంస్థల జాబితాలో బజాజ్ ట్విన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో ముందు వరుసలో నిలిచాయి.
మంత్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్ దగ్గరపడుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బజాజ్ ఫైనాన్స్ సంస్థ క్యూ4లో మంచి పనితీరు కనబరచటం కలిసొచ్చింది. ఆ కంపెనీ షేర్ల విలువ 3 శాతం పెరిగింది. ఎల్టీటీఎస్ స్టాక్ వ్యాల్యూ కూడా 4 శాతం ర్యాలీ తీసింది. కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ పెరగటం ప్లస్ పాయింట్ అయింది.
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
read more: Land Rates in Hyderabad: హైదరాబాద్లో భూముల రేట్లు.. యావరేజ్గా గజం స్థలం ఎంతుందంటే?..
రంగాల వారీగా చూసుకుంటే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ మరియు రియాల్టీ ఇండెక్స్లు సున్నా పాయింట్ మూడు శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు.. నిఫ్టీ మీడియా సూచీ సున్నా పాయింట్ 2 శాతం పడిపోయింది. సెన్సెక్స్ 348 పాయింట్లు పెరిగి 60 వేల 649 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17 వేల 915 వద్ద ఎండ్ అయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 30 సంస్థల్లో ఏకంగా 24 సంస్థలు మెరిశాయి. ఆరు సంస్థలు మాత్రమే చతికిలపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 50 కంపెనీల్లో 15 కంపెనీలు మాత్రమే లాభాల బాట పట్టాయి. మిగతావి వెనకబడ్డాయి. మ్యాన్కైండ్ ఫార్మా సంస్థ చేపట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి మూడో రోజు, చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు 14 పాయింట్ ఒకటీ ఐదు శాతం మాత్రమే సబ్స్క్రిప్షన్ లభించింది.
10 గ్రాముల బంగారం ధర 304 రూపాయలు పెరిగింది. తద్వారా 60 వేల 197 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 587 రూపాయలు పెరిగింది. ఫలితంగా 74 వేల 406 రూపాయల గరిష్ట విలువ పలికింది. క్రూడాయిల్ ధర 128 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 107 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 84 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?