Today Stock Market Roudup 20-04-23: తొలిసారి రూ.5 ట్రిలియన్లు దాటిన ఐటీసీ మార్కెట్ క్యాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roudup 20-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ గురువారం ఊగిసలాట ధోరణిలో కొనసాగాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత లాభాల్లోకి వచ్చి ఇంట్రాడేలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి.
గ్లోబల్ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితులతోపాటు లోకల్ కంపెనీల క్యూ4 ఫలితాలు ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేశాయి.
సెన్సెక్స్ నామమాత్రంగా 64 పాయింట్లు పెరిగి 59 వేల 632 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. సింగిల్ డిజిట్.. అంటే.. 5 పాయింట్లు మాత్రమే పెరిగి 17 వేల 624 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
read more: Sid’s Dairy Farm: స్వచ్ఛమైన పాలకు అచ్చమైన సంస్థ అంటున్న కిషోర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్ విశేషంగా రాణించాయి. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ వంటి లార్జ్ క్యాప్స్.. బెంచ్ మార్క్ ఇండెక్స్లకు మద్దతుగా నిలిచాయి.
మరో వైపు.. ఇన్ఫోసిస్, రిలయెన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్ స్టాక్స్ ఒత్తిడి పెంచాయి. ఇదిలాఉండగా.. ఐటీసీ సంస్థ తొలిసారిగా ఎలైట్ గ్రూప్ కంపెనీల జాబితాలోకి చేరింది. మార్కెట్ క్యాప్ వ్యాల్యూ 5 ట్రిలియన్ రూపాయలు దాటిన సంస్థలను ఎలైట్ గ్రూప్ కంపెనీలుగా వ్యవహరిస్తారు.
ఈ కంపెనీ షేర్ విలువ ఇవాళ ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 402 రూపాయల 60 పైసలుగా నమోదైంది. రంగాల వారీగా పరిశీలిస్తే.. ప్రైవేట్ బ్యాంక్, ఆటో స్టాక్స్ మంచి పనితీరు కనబరచగా.. ఫార్మా, రియాల్టీ స్టాక్స్ వెనకబడ్డాయి. 10 గ్రాముల బంగారం ధర 72 రూపాయలు పెరిగి గరిష్టంగా 60 వేల 370 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 157 రూపాయలు పెరిగి అత్యధికంగా 75 వేల 629 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 160 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 406 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 16 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!