ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓ వైపు కూటమి, మరో వైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేయనున్నారు. మే 6వ తేదీన(రేపు) మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంట్ పరుధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రం అంబేడ్కర్ విగ్రహం సెంటర్ లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రం శ్రీనివాస్ మహల్ సెంటర్ లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో చేపట్టే ప్రచార సభకు హాజరై ప్రసంగిస్తారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేయనున్నారు.
YSRCP: రేపు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..

Jagan
