‘విరోష్’ అంటూ అభిమానులు పిలిచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట రియల్ లైఫ్ లో ఒక్కటవ్వడం వారి స్క్రీన్ కెమిస్ట్రీకి కొత్త అర్ధం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు స్టార్ కపుల్ వెడ్డింగ్ ఫోటోస్ కి హైయెస్ట్ 15 మిలియన్స్ కి పైగా లైక్స్ కియారా అద్వానీ, సిద్ధార్త్ మల్హోత్రా జంట ఖాతాలో ఉండగా ఇప్పుడా రికార్డ్ విరోష్ జంటకు షిఫ్ట్ అయ్యింది. ఇన్ స్టాలో రష్మిక పోస్ట్ చేసిన వెడ్డింగ్ ఫోటోస్ కి ఏకంగా 23 మిలియన్స్ ఆఫ్ లైక్స్ రావడం విశేషం. దీంతో ఇప్పటివరకు ‘రణబాలి’ సినిమాపైన ఉన్న బజ్ ఒకెత్తు ఇప్పుడు మరో ఎత్తు అన్నట్టుగా మారింది పరిస్తితి. వెడ్డింగ్ పోస్టర్, రిలీజ్ చేసిన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం సినిమాపై అంచనాలను డబుల్ చేసింది.
Also Read : Ustad Bhagath Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం డేట్స్ ఇచ్చిన డిప్యూటీ సీఎం
ముందుగా ‘రణబాలి’ని కంట్రోల్డ్ బడ్జెట్ తో ప్లాన్ చేశారు మేకర్స్. కారణం విజయ్ గత సినిమాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ , కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం. దీంతో ఓటీటీ సంస్థలు కూడా హై రేంజ్ డీల్స్ విషయంలో వెనకడుగు వేశాయి. కానీ పెళ్లి హైప్ తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇవ్వడంతో ఇప్పుడు మేకర్స్ బడ్జెట్ పెంచేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సులు విదేశీ లొకేషన్లు హైఎండ్ టెక్నికల్ వర్క్… ఇవన్నీ ప్లాన్ లోకి వచ్చాయట. ఇప్పటికే దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. పెళ్లి తో వచ్చిన పబ్లిసిటీ… సినిమాకు ఫ్రీ ప్రమోషన్ లా మారింది. సోషల్ మీడియాలో 23 మిలియన్ లైక్స్ సునామీ సినిమాకి భారీ బూస్ట్ లా పనిచేస్తోంది. మరి ‘విరోష్’ పెళ్లి… ‘రణబాలి’ని బ్లాక్బస్టర్ రేంజ్ కి తీసుకెళ్తుందా? సెప్టెంబర్ 11న రిలీజ్ కానున్న ఈ సినిమా… వారి లవ్ సక్సెస్ ను బాక్సాఫీస్ సక్సెస్ గా మార్చుకుంటుందా? రియల్ లైఫ్ మ్యాజిక్… రీల్ లైఫ్ హిట్ అవుతుందా? అందరి చూపు ఇప్పుడు ‘రణబలి’పైనే ఉంది
