Delhi Special Court: తోటి ఖైదీని హతమార్చిన కేసులో నలుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీహార్ జైల్లో తోటి ఖైదీని క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. మూడేళ్ల నాటి ఈ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారించింది. అప్పట్లో ఈ జైల్లో హత్య ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలు కిషన్ శ్రేష్ఠ, గణపత్ అలియాస్ కునాల్, హన్నీ, అరుణ్ అలియాస్ మాండ్వాలను దోషులుగా తేలుస్తూ.. ఢిల్లీలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. నలుగురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించిందని సీబీఐ ప్రతినిధి తెలిపారు. జూన్ 5, 2024న శిక్షను ప్రకటించాలని కోర్టు నిర్ణయించింది.
READ MORE: Karnataka : ఆపరేషన్ చేసి గర్భాశయంలో మూడడుగుల బట్ట మర్చిపోయిన డాక్టర్
Also Read
కాగా.. ఈ కేసు అప్పట్లో దుమారం రేపింది. జైలులో మరణించిన ఖైదీ పేరు శ్రీకాంత్ రామ్ స్వామి. తీహార్ జైలు నంబర్ 2లోని బ్యారక్ నంబర్ 4లో అతడిని ఉంచారు. శ్రీకాంత్ అండర్ ట్రయల్ ఖైదీ, అతనిపై హత్య, దోపిడీ వంటి అనేక తీవ్రమైన కేసులు ఉన్నాయి. కాగా.. అదే జైలులో ఉన్న నలుగురు ఖైదీలు శ్రీకాంత్ రామ్ స్వామిపై క్రికెట్ బ్యాట్లతో అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం స్థానిక సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. శ్రీకాంత్ రామ్స్వామి సోదరి సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఐదు నెలల్లోనే 2021 డిసెంబర్ 22న సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!