Thane: డబ్బు మదంతో ప్రియురాలిపైకి ఎక్కించిన కారు.. పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thane: మనిషికి ఎప్పుడైతే డబ్బు, అధికారం అనే మత్తు ఆవహిస్తుందో.. అప్పుడు తనలోని జంతువు మేల్కొంటుంది. దీనికి సజీవ ఉదాహరణ మహారాష్ట్రలోని థానేలో కనిపించింది. మహారాష్ట్రకు చెందిన ఎంఎస్ఆర్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కుమారుడు తన ప్రియురాలిని ఎస్యూవీ కారుతో ఎక్కించి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తర్వాత థానేలో కలకలం రేగింది. ప్రియా సింగ్ అనే అమ్మాయి తన ప్రియుడు అశ్వజిత్ గైక్వాడ్పై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
థానే నివాసి అశ్వజిత్ గైక్వాడ్, ప్రియా సింగ్ గత నాలుగున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అశ్వజీత్కి అప్పటికే పెళ్లయిందని కొంతకాలం క్రితం ప్రియా సింగ్కు తెలిసింది. అయినా వారి సంబంధం కొనసాగింది. సోమవారం అర్థరాత్రి, ప్రియా సింగ్ థానేలోని ఘోడ్బందర్ ప్రాంతంలో ఉన్న హోటల్ సమీపంలో తన ప్రియుడిని కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో అశ్వజీత్ని భార్యతో చూసింది. దీంతో అప్పుడు ఆమె కోపంతో బయలు దేరింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అశ్వజీత్, అతని స్నేహితులు రోమిల్ పాటిల్, సాగర్ కలిసి ప్రియా సింగ్ను కొట్టి కారుతో తొక్కించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ఒక కాలు ఎముక కూడా విరిగిపోయింది. దీంతో బాధితురాలు ప్రియా సింగ్ నిందితుడైన ప్రియుడిపై కేసు నమోదు చేసేందుకు కసర్వద్వాలి పోలీస్ స్టేషన్కు చేరుకుంది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Read Also:Red stag: అంతరించిపోతున్న కశ్మీర్ జింకలు..
ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితుడు అశ్వజిత్ గైక్వాడ్కు చాలా మంది నేతలతో లోతైన సంబంధాలు ఉన్నాయని బాధితురాలు రాసింది. అతని తండ్రి అనిల్ కుమార్ గైక్వాడ్ MSRDC మేనేజింగ్ డైరెక్టర్, దీని కారణంగా పోలీసులు ఈ కేసు నమోదు చేయలేదు. బాధితురాలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఒత్తిడి చేయడంతో వారు కేసు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలు థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసు డీసీపీ అమర్సింగ్ జాదవ్ ఈ విషయమై మరింత సమాచారం అందజేసారు. ఘోడ్బందర్లోని ఒక హోటల్ వెలుపల నిందితులు, బాధితుడి మధ్య గొడవ జరిగినప్పుడు తర్వాత ఆమెను కొట్టారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:Salaar : బెంగళూరు సిటీ లో సలార్ అన్ బీటబుల్ రికార్డు.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!