Thane: డబ్బు మదంతో ప్రియురాలిపైకి ఎక్కించిన కారు.. పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thane: మనిషికి ఎప్పుడైతే డబ్బు, అధికారం అనే మత్తు ఆవహిస్తుందో.. అప్పుడు తనలోని జంతువు మేల్కొంటుంది. దీనికి సజీవ ఉదాహరణ మహారాష్ట్రలోని థానేలో కనిపించింది. మహారాష్ట్రకు చెందిన ఎంఎస్ఆర్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కుమారుడు తన ప్రియురాలిని ఎస్యూవీ కారుతో ఎక్కించి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన తర్వాత థానేలో కలకలం రేగింది. ప్రియా సింగ్ అనే అమ్మాయి తన ప్రియుడు అశ్వజిత్ గైక్వాడ్పై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
థానే నివాసి అశ్వజిత్ గైక్వాడ్, ప్రియా సింగ్ గత నాలుగున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అశ్వజీత్కి అప్పటికే పెళ్లయిందని కొంతకాలం క్రితం ప్రియా సింగ్కు తెలిసింది. అయినా వారి సంబంధం కొనసాగింది. సోమవారం అర్థరాత్రి, ప్రియా సింగ్ థానేలోని ఘోడ్బందర్ ప్రాంతంలో ఉన్న హోటల్ సమీపంలో తన ప్రియుడిని కలవడానికి వెళ్లింది. ఆ సమయంలో అశ్వజీత్ని భార్యతో చూసింది. దీంతో అప్పుడు ఆమె కోపంతో బయలు దేరింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అశ్వజీత్, అతని స్నేహితులు రోమిల్ పాటిల్, సాగర్ కలిసి ప్రియా సింగ్ను కొట్టి కారుతో తొక్కించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ఒక కాలు ఎముక కూడా విరిగిపోయింది. దీంతో బాధితురాలు ప్రియా సింగ్ నిందితుడైన ప్రియుడిపై కేసు నమోదు చేసేందుకు కసర్వద్వాలి పోలీస్ స్టేషన్కు చేరుకుంది.
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
Read Also:Red stag: అంతరించిపోతున్న కశ్మీర్ జింకలు..
ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితుడు అశ్వజిత్ గైక్వాడ్కు చాలా మంది నేతలతో లోతైన సంబంధాలు ఉన్నాయని బాధితురాలు రాసింది. అతని తండ్రి అనిల్ కుమార్ గైక్వాడ్ MSRDC మేనేజింగ్ డైరెక్టర్, దీని కారణంగా పోలీసులు ఈ కేసు నమోదు చేయలేదు. బాధితురాలి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఒత్తిడి చేయడంతో వారు కేసు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలు థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసు డీసీపీ అమర్సింగ్ జాదవ్ ఈ విషయమై మరింత సమాచారం అందజేసారు. ఘోడ్బందర్లోని ఒక హోటల్ వెలుపల నిందితులు, బాధితుడి మధ్య గొడవ జరిగినప్పుడు తర్వాత ఆమెను కొట్టారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:Salaar : బెంగళూరు సిటీ లో సలార్ అన్ బీటబుల్ రికార్డు.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్..
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!