NTV Telugu Site icon

Sexual Harassment: పదో తరగతి చదువుతున్న బాలికపై మేనమామ అత్యాచారం..

Rape

Rape

రోజు రోజుకు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులు పెట్రేగిపోతున్నారు. ఎన్ని చట్టాలొచ్చినా.. అస్సలు భయపడకుండా హద్దు మీరుతున్నారు. బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు తండ్రి లేడు. తల్లితో పాటు అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. అయితే.. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండి చూసుకోవాల్సిన మేనమామ తన పాలిట క్రూరత్వం ప్రదర్శించాడు.

Read Also: Vijay Devarakond: గొప్ప మనుసు చాటుకున్న విజయ్ దేవరకొండ

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుసరాయ్‌లో మేనమామ తన సొంత మేనకోడలిపై హత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జహాన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు డయల్-112కు సమాచారం అందిందని.. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులను, కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read Also: MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

నిందితుడు మహ్మద్ అన్సార్ (35)గా గుర్తించారు. కాగా.. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వృత్తిరీత్యా డ్రైవర్‌. పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక తల్లి మాట్లాడుతూ.. తన భర్త ఈ లోకంలో లేడని చెప్పింది. ఆమె తన తల్లి ఇంటిలో నివసిస్తుంది. తన కూతురిపై అత్యాచారం చేసింది తన సోదరుడేనని పేర్కొంది. తన కూతురు పదో తరగతి చదువుతోందని తెలిపింది. ఆ తర్వాత.. తల్లి స్పృహ తప్పి పడిపోయింది.