టాటా మోటార్స్ కార్లు కొనాలనుకునే వారికి బిగ్ అలర్ట్. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, తన పెట్రోల్ , డీజిల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. సగటున 0.5 శాతం మేర ధరలు పెరగనున్నాయి. అయితే.. మీరు ఎంచుకునే కారు మోడల్ , వేరియంట్ను బట్టి ఈ ధరల పెంపులో మార్పులు ఉండవచ్చు. అంటే కొన్ని కార్లపై తక్కువగా, మరికొన్నింటిపై కొంచెం ఎక్కువగా ప్రభావం ఉండవచ్చు. కేవలం పెట్రోల్, డీజిల్ (ICE) వాహనాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.
Also Read:Ration Card Holders: తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ శుభవార్త.. జూన్ 2 నుంచే ప్రారంభం..
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?
కార్లు తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల (స్టీల్, అల్యూమినియం వంటివి) ధరలు పెరగడం, రవాణా ఖర్చులు ఎక్కువ కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ అదనపు భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఇతర కంపెనీలతో పోటీని దృష్టిలో ఉంచుకుని, సామాన్యులపై మరీ ఎక్కువ భారం పడకుండా చాలా తక్కువ మొత్తంలోనే ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది.
ఏ ఏ కార్లపై ప్రభావం ఉంటుంది..?
టాటా మోటార్స్కు చెందిన ప్రముఖ మోడల్స్ అయిన హ్యాచ్బ్యాక్, సెడాన్ , ఎస్యూవీ (SUV) విభాగాల్లోని అన్ని పెట్రోల్, డీజిల్ కార్లకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. మీరు మార్చి నెలాఖరులోపు కారు బుక్ చేసుకుంటే పాత ధరలకే పొందే అవకాశం ఉండవచ్చు.
