Harbhajan Singh: టీ20 వరల్డ్ కప్పును భారత్ కైవసం చేసుకుంది. టీమిండియా మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో భారత్ మొత్తం సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యలో ఈ టీ20 వరల్డ్ కప్పు చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జైషా కలిసి పక్కన ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లారు. ట్రోఫీతో సహా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడంపై భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ట్రోఫీని కేవలం ఆలయానికే మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు? ఇతర మతపరమైన ప్రార్థనా మందిరాలకు ఎందుకు తీసుకెళ్లలేదని ఆజాద్ ప్రశ్నించారు.
READ MORE: CM Chandrababu: రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష!
కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపై తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆజాద్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు. ఆజాద్ వ్యాఖ్యలు దురదృష్టకరం. భారత జట్టు ట్రోఫీని ఆలయానికి, మసీదుకు లేదా చర్చికి ఇలా వాళ్లకు నచ్చిన ప్లేస్కు తీసుకెళ్లొచ్చు. తమ వరల్డ్ కప్పు కోరిక నెరవేరినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడంలో తప్పేముంది?. ఒక మాజీ ప్లేయర్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.. కప్పు గెలిచిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏంటి?” అని హర్భజన్ ప్రశ్నించారు. అన్ని మతాలు ఒకటేనని, ఎవరి విశ్వాసం వారిదని భజ్జీ స్పష్టం చేశారు. మరోవైపు.. కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. సంతోషంగా కప్పు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం పక్కన పెట్టి ఈ వివాదంలో మునిగిపోయారు.
READ MORE: Iran-US: ఇరాన్పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం
