Sushmita Konidela: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ ఒక శిఖరం. ఆయన పక్కన నిలబడాలన్నా, మాట్లాడాలన్నా ఎంతటి వారికైనా కొంచెం వణుకు రావడం సహజం. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ‘గోసాయి వెంకన్న’ అనే కీలక పాత్రలో కనిపించారు. అలాంటి వ్యక్తికి స్టైలిస్ట్ గా పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించిన సుస్మిత కొణిదెల, బిగ్ బి అమితాబ్ బచ్చన్తో గడిపిన అద్భుత క్షణాలను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక లెజెండ్తో పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైన టెన్షన్, ఆయన చూపిన గౌరవం గురించి సుస్మిత ఈ పాడ్కాస్ట్లో వివరించారు.
READ ALSO: IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రారంభంలో కొంచెం ఆందోళన పడ్డానని సుస్మిత అంగీకరించారు. “ఆయన పక్కన నిలబడితేనే ఒక తెలియని గౌరవప్రదమైన భయం కలుగుతుంది. మొదటి రోజు షూటింగ్లో నేను కొంచెం టెన్షన్ పడ్డాను” అని తెలిపారు. అయితే, అమితాబ్ గారు తనను పిలిచి, తన మేకప్, లుక్ విషయంలో ఆమె అభిప్రాయాన్ని అడగడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా, ఒక డిజైనర్కు ఇచ్చే ప్రాధాన్యత ఆయన సంస్కారానికి నిదర్శనమని ఆమె కొనియాడారు. షూటింగ్ సెట్లో ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో నిశితంగా గమనిస్తారని చెప్పారు. ఆయన ఏ పని చేసినా అందులో ఒక పద్ధతి ఉంటుందని, సెట్స్లో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటారని తెలిపారు. ఆయన చూపే శ్రద్ధ, పని పట్ల ఆయనకున్న నిబద్ధత చూసి తాము ఎంతో నేర్చుకున్నామని ఆమె పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ వంటి గ్లోబల్ స్టార్ తో కలిసి పనిచేయడం తన కెరీర్లో ఒక మైలురాయి అని సుస్మిత అన్నారు.
READ ALSO: Sushmita Konidela:’రంగస్థలం’ ఒక బెంచ్మార్క్.. చిట్టిబాబు మేకోవర్ వెనుక అసలు కథ ఇదే: సుస్మిత కొణిదెల
