భారత క్రికెట్ అభిమానులకు ఒకవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఉత్సాహం ఉంటే.. మరోవైపు ఒక చేదు వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు (మార్చి 8)న న్యూజిలాండ్తో జరగనున్న ఈ చారిత్రాత్మక పోరు తర్వాత.. టీమ్ ఇండియా ‘మిస్టర్ 360’ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం భారత టీ20 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సూర్యకుమార్, ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండా తన కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గెలిచినా, ఓడినా ఇదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ఆయన భావిస్తున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్కై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన అనేది రాలేదు.
