NTV Telugu Site icon

Surya Kumar Yadav: టెస్టు జట్టులోకి తిరిగి రావాలని కోరుకుంటున్న: సూర్య కుమార్

Surya Kumar

Surya Kumar

Surya Kumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఏడాది తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ఆడనున్నాడు. దీని తర్వాత దులీప్ ట్రోఫీలో కూడా పాల్గొంటాడు. భారత్ తరఫున కేవలం 1 టెస్టు ఆడిన సూర్యకుమార్ మళ్లీ టెస్టు జట్టులోకి రావాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా కోయంబత్తూరులో సోమవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీ ప్రాక్టీస్ సెషన్ తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ.. చాలా మంది టెస్టులలో తమ స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇక నేను కూడా మళ్లీ ఆ స్థానాన్ని పొందాలనుకుంటున్నాను. అయితే, భారత్‌కు టెస్టు జట్టులో ఎంపిక చేయడం తన చేతుల్లో లేదని సూర్యకుమార్ తెలిపాడు. జట్టులోకి పునరాగమనం చేయడం నా నియంత్రణలో లేదు. ప్రస్తుతం నేను చేయగలిగింది బుచ్చిబాబు టోర్నీ ఆడడం, ఆ తర్వాత దులీప్‌లో పాల్గొనడం, ఆపై ఏమి జరుగుతుందో చూడడం. ఇక నేను ఎర్ర బంతితో మళ్లీ ఆడటానికి సంతోషిస్తున్నాను అని తెలిపాడు.

Mouth Wash: మౌత్ వాష్ ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదేనా.?

సూర్యకుమార్ నిజానికి టి20 క్రికెట్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడతాడు. మరోవైపు, అతను తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో కూడా అద్భుతాలు చేశాడు. ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సూర్యకుమార్ 82 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 43.62 సగటుతో 5,628 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌ లో అతని అత్యధిక స్కోరు 200 పరుగులు. సూర్యకుమార్ గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌ లో, అతను 1 ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 1 ఫోర్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత గాయం కారణంగా మొత్తం సిరీస్‌ కు దూరమయ్యాడు.