Supreme Court: హిమాచల్ ప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్.. స్టేకు నిరాకరణ
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కోరింది. ఆరుగురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్పై విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారిని అనుమతించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ఇదిలా ఉంటే ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్ కుల్దీప్ సింగ్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించాలని రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. స్టే విధించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని.. దీనిపై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పీకర్కు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.
సార్వత్రిక ఎన్నికల కోసం గత శనివారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో అనర్హత వేటు పడిన ఆరు స్థానాల్లో కూడా ఉప ఎన్నిక చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు మే 7 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది.
అయితే గత ఫిబ్రవరి నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. వీరిపై ఫిబ్రవరి 29న స్పీకర్ అనర్హత వేటు విధించారు. దీనిపై వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఎమ్మెల్యేలపై వేటుతో అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం 40 నుంచి 34కి పడిపోయింది.
ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు వీరే: సుధీర్ శర్మ (ధర్మశాల), రవి ఠాకూర్ (లాహౌల్-స్పితి), రాజిందర్ రాణా (సుజన్పూర్), ఇందర్ దత్ లఖన్పాల్ (బార్సర్), చైతన్య శర్మ (గాగ్రేట్) మరియు దేవిందర్ కుమార్ (కుట్లేహర్)
హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడంతో ఆ సంఖ్య 62కి పడిపోయింది. ఇదిలా ఉంటే 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ మాత్రం రాజ్యసభ సీటును దక్కించుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే మద్దతుగా నిలిచారు.
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?