Abrar Ahmed: సన్రైజర్స్ లీడ్స్కు బిగ్ షాక్ తగిలింది. సన్ గ్రూపే లీడ్స్ టీమ్కు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓనర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సన్రైజర్స్ లీడ్ గ్రూప్ ది హండ్రెడ్ లీగ్లో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ను కోనుగోలు చేసింది. ఈ అంశం ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎస్ఆర్హెచ్ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే.. ఈ సీజన్లో అబ్రార్ అహ్మద్ ది హండ్రెడ్ లీగ్లో ఆడే అవకాశాలు లేవట. ఎందుకంటే.. ఇప్పటి వరకు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్కు “నో అబ్జాక్షన్” (No Objection) సర్టిఫికేట్ రాలేదట. అంతేకాదు.. ది హండ్రెడ్ లీగ్ ప్రారంభం అయ్యే సమయంలోనే పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలను పీసీబీ సిద్ధం చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎన్వోసీ (NOC – No Objection Certificate) ఇవ్వదని క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈ విషయాన్ని పీబీసీ వర్గాలు వెల్లడించాయి. పీసీబీతో అతడికి మంచి రిలేషన్ ఉంది. కానీ, అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ నేపథ్యంలో అబ్రార్ ది హండ్రెడ్ లీగ్లో ఆడే అవకాశాలు 50-50గా మాత్రమే ఉన్నాయని పేర్కొంది.
READ MORE: LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
ఇదిలా ఉండగా.. మరోవైపు ఈ అంశంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇది ఐపీఎల్కు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. ఇది విదేశీ లీగ్లో జరిగిన వ్యవహారం.. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకునే ఛాన్స్ లేదని తెలిపారు. విదేశీ లీగ్లలో ఫ్రాంచైజీలు ఎవరిని తీసుకోవాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో బీసీసీఐ జోక్యం ఉండదని వివరించారు. పాకిస్థాన్ ప్లేయర్ అబ్రార్ను తీసుకోవడంలో ఆ ఫ్రాంచైజీదే తుది నిర్ణయమని వెల్లడించారు..
