Sunday Special : కోడి పులావ్ ను ఇలా చేశారంటే.. మెతుకు కూడా మిగల్చరు..
చికెన్ తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం..చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బిర్యానిలు తిని తిని బోర్ కొడుతుంది.. చికెన్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. పులావ్ ను సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోనసీమ కోడి పులావ్ ను ఎలా తయారు చేస్తే రుచి వేరే లెవల్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
నూనె – అర కప్పు,
దాల్చిన చెకక్క ముక్కలు – 2,
మరాఠీ మొగ్గ – 2,
బిర్యానీ ఆకు – 1,
అనాస పువ్వు – 1,
కరివేపాకు – ఒక రెమ్మ,
సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1,
తరిగిన పచ్చిమిర్చి – 6,
జీడిపప్పు – గుప్పెడు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్స్,
ఉప్పు- తగినంత,
పసుపు – అర టీ స్పూన్,
కారం – 3 టీ స్పూన్స్,
చికెన్ – ముప్పావు కిలో,
తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్,
తరిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్,
కొబ్బరి పాలు – ఒక కప్పు,
అర గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 కప్పులు,
నీళ్లు – 3 కప్పులు,
నిమ్మరసం – అర చెక్క,
బిర్యాని మసాలా – తగినంత..
తయారీ విధానం :
ముందుగా బిర్యాని మసాలాను అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.. లేకుంటే మీ చాయిస్..తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేయించాలి. తరువాత మసాలా దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి.. ఆ తర్వాత చికెన్ ను వేసి 7 నిమిషాల పాటు బాగా ఉడకానివ్వాలి.. కొత్తిమీర, పుదీనా, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి.దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.. ముందుగా కడిగిపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి..రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి మంటను చిన్నగా చేసి పూర్తిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. ఆ తర్వాత కొద్ది సేపు అలానే వదిలెయ్యాలి.. తర్వాత పెరుగు చట్నీ వేసుకొని వేడి వేడిగా తింటే టేస్ట్ వేరే లెవల్ అంతే.. చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదూ.. మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!