Sunday Special : కోడి పులావ్ ను ఇలా చేశారంటే.. మెతుకు కూడా మిగల్చరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం..చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే బిర్యానిలు తిని తిని బోర్ కొడుతుంది.. చికెన్ పులావ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. పులావ్ ను సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే కోనసీమ కోడి పులావ్ ను ఎలా తయారు చేస్తే రుచి వేరే లెవల్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు..
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
నూనె – అర కప్పు,
దాల్చిన చెకక్క ముక్కలు – 2,
మరాఠీ మొగ్గ – 2,
బిర్యానీ ఆకు – 1,
అనాస పువ్వు – 1,
కరివేపాకు – ఒక రెమ్మ,
సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1,
తరిగిన పచ్చిమిర్చి – 6,
జీడిపప్పు – గుప్పెడు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్స్,
ఉప్పు- తగినంత,
పసుపు – అర టీ స్పూన్,
కారం – 3 టీ స్పూన్స్,
చికెన్ – ముప్పావు కిలో,
తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్,
తరిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్,
కొబ్బరి పాలు – ఒక కప్పు,
అర గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 కప్పులు,
నీళ్లు – 3 కప్పులు,
నిమ్మరసం – అర చెక్క,
బిర్యాని మసాలా – తగినంత..
తయారీ విధానం :
ముందుగా బిర్యాని మసాలాను అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.. లేకుంటే మీ చాయిస్..తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేయించాలి. తరువాత మసాలా దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి.. ఆ తర్వాత చికెన్ ను వేసి 7 నిమిషాల పాటు బాగా ఉడకానివ్వాలి.. కొత్తిమీర, పుదీనా, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి.దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.. ముందుగా కడిగిపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి..రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి మంటను చిన్నగా చేసి పూర్తిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.. ఆ తర్వాత కొద్ది సేపు అలానే వదిలెయ్యాలి.. తర్వాత పెరుగు చట్నీ వేసుకొని వేడి వేడిగా తింటే టేస్ట్ వేరే లెవల్ అంతే.. చెప్తుంటే నోరు ఊరిపోతుంది కదూ.. మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!