Student Suicide Case: కృష్ణాజిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్ నెలలో పవన్ కుమార్ తోటి విద్యార్థి హేమంత్ కి హాస్టల్లో చెలరేగిన వివాదంతో జనవరి 5న పవన్ ను హేమంత్ కొట్టాడు. కొట్టిన దృశ్యాలు ఇంస్టాగ్రామ్ లో హేమంత్ పోస్ట్ చేశాడు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్ పై హేమంత్ దాడి చేశాడు.
UPI Payments: ఏడాదిలో రూ.230 లక్షల కోట్ల UPI ట్రాన్సాక్షన్స్.. రాజ్యసభకు తెలిపిన మంత్రి పంకజ్ చౌదరి
దీంతో మనస్థాపానికి గురై హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని పవన్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లు తన చేతిపై పవన్ రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలను గోప్యంగా చైతన్య యాజమాన్యం ఉంచింది. ఈ విషయంలో సాక్షాలను శ్రీ చైతన్య యాజమాన్యం తారుమారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై ఉన్న పేర్లు శ్రీ చైతన్య సిబ్బంది తుడిచేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనితో కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జూనియర్ లెక్చరర్ లు రాజేష్, ఆనంద్, కృష్ణ మెస్ బాయ్ హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
