300 Varieties Of Mango : ఒక్క చెట్టుకు 300రకాల మామిడి పండ్లా.. ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
300 Varieties Of Mango : వేసవి వచ్చిందంటే చాటు మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ప్రతి ఒక్కరు వాటిని తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా మామిడిలో చాలా రకాలున్నాయి. కానీ ఇవన్నీ వేరు వేరు చెట్లకు కాస్తాయి. కానీ ఒకే చెట్టుకు 300రకాలమామిడి పండ్లు పండితే ఎలా ఉంటుంది.. కోరుకున్న పండును కావలిన టైంలో తినేయవచ్చు కదా.. ఆ ఊహే ఎలా ఉంది.. బాగుంది కదా.. ఈ చెట్టు ఎక్కడుంది దాని ప్రత్యేకత తెలుకుందాం.
Read Also:Saturday Stotra Parayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే…
Also Read
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
- Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. లక్నో నగరంలో ప్రత్యేకంగా మాట్లాడుకునే మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క చెట్టుపైనే దాదాపు 300 రకాల మామిడి పండ్లు పండుతాయి. ఈ చెట్టు లక్నోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్ చౌక్ సమీపంలో ఉంది.లక్నో నగరానికి చెందిన హాజీ కలీమ్ ఉల్లాఖాన్ అనే వ్యక్తి ఎంతో శ్రమతో ఒక చెట్టును కనుగొన్నాడు, ఇది చూపరులను ఆశ్చర్యపరిచింది. గ్రాఫ్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అతను 300 రకాల మామిడిని పండించే చెట్టును కనుగొన్నాడు. ఈ చెట్టు రహస్యాన్ని తెలుసుకునేందుకు జపాన్ నుంచి వచ్చిన బృందం కూడా ఇక్కడికి వచ్చింది. ఈ విశిష్ట పనికి గాను హాజీ కలీమ్ను అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
Read Also:Karnataka Judgement day Live: కర్నాటకలో ఎన్నికల కౌంటింగ్.. దేశమంతా ఉత్కంఠ
మ్యాంగో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్
హాజీ కలీం సాహెబ్ 17 సంవత్సరాల వయస్సులో ఒక మొక్కను కనుగొన్నారు. దాని నుండి సుమారు 7 రకాల మామిడి పండ్లను పండించారు. అంతే కాదు, హాజీ కలీమ్ సాహెబ్ మామిడిపండ్లపై చేసిన కృషి వల్ల ప్రపంచంలోనే మ్యాంగో మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఈ వింత చెట్టుపై ఏ మామిడి పండ్లను పండించినా వాటిని అమ్మకుండా ప్రజలకే పంచుతున్నారు. హాజీ కలీమ్ సాహెబ్ మామిడి చెట్టు మొత్తం కళాశాలగా అభివర్ణించారు. దానిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మామిడి చెట్టును సరిగ్గా ఉపయోగించుకుంటే క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా నయం అవుతాయని హాజీ కలీమ్ సాహెబ్ చెప్పారు. మ్యాంగో మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన ఈ వ్యక్తి 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. నేడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అతనిని సంప్రదించడానికి వస్తున్నారు.
తాజావార్తలు
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!