NTV Telugu Site icon

Srisailam: డెడ్‌ స్టోరేజీకి చేరువలో శ్రీశైలం జలాశయం నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి సంబంధించి తాగునీటి అవసరాలను పక్కనపెట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. తాగు, సాగు నీటి అవపరాలు తీరినప్పుడే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచనలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టేశాయి. ఫలితంగా శ్రీశైలం జలాశయం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. 215 టీఎంసీల సామర్థ్యానికి గాను 35 టీఎంసీల డెడ్‌స్టోరేజీ స్థాయికి నిల్వలు పడిపోయాయి.

Read Also: రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇకపై జాతీయ ప్రాజెక్టులో 60 శాతం నిధులే

శ్రీశైలంలో నీటిమట్టం పడిపోవడం… వచ్చేది వేసవికాలం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు నీటి ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్‌లో ఒక్క శ్రీశైలం వాటానే చెరో 40 శాతంగా ఉంది. నిజానికి తాగు, సాగునీటి అవసరాల కోసమే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఐదు నెలల క్రితమే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేఆర్ఎంబీ లేఖలు రాసింది. ఆ సమయానికి శ్రీశైలంలో 856.10 అడుగుల నీటి మట్టంతో 94.91 టీఎంసీల నిల్వలు ఉండేవి. అయితే ఇరు రాష్ట్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండడంతో మంగళవారం సాయంత్రానికి నీటి నిల్వ 35.51 టీఎంసీలకు పడిపోయింది.