Site icon NTV Telugu

Srinu Vaitla: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా: కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు!

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో కొందరు వ్యక్తులు ఆయన్ని నమ్మించి నిలువునా ముంచేశారు. కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను కలిశారు. తమకు చేవెళ్లలో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని విక్రయిస్తున్నామని నమ్మబలికారు. వారు చూపించిన పత్రాలను నమ్మిన దర్శకుడు, ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ. 1 కోటి వరకు చెల్లించారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం.

Also Read Vaani Kapoor: టూ పీస్ అవుట్ ఫిట్‌లో రచ్చ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తోన్న వాణీ!

ఇటీవలి వరకు ఆ భూమి తనదేనని భావించిన శ్రీను వైట్లకు కోర్టు తీర్పుతో గట్టి షాక్ తగిలింది. ఆ స్థలం అసలు యజమానులు వేరే వ్యక్తులని, మోసగాళ్లు ఫోర్జరీ పత్రాలతో లేదా తప్పుడు సమాచారంతో ఆయన్ని నమ్మించారని తేలిపోయింది, ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తమను మోసం చేసి, వేరే వాళ్ల స్థలాన్ని తనకు అంటగట్టినట్లు గుర్తించిన శ్రీను వైట్ల వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మోసంపై ఆయన హైదరాబాద్ సి.సి.ఎస్ (CCS) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎంతటి వారైనా సరే భూములు కొనేముందు పక్కాగా లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version