TTD Laddu Controversy: కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. అలిపిరి సమీపంలోని భూదేవీ కాంప్లెక్స్ నుంచి ఈ విచారణ స్టార్ట్ కానుంది. ఇవాళ విచారణలో పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలించనుంది. కమిషన్కు సాయంగా ఉండేందుకు లైజన్ ఆఫీసర్గా ఏఈవోగా ఉన్న ఎన్. రవిని ప్రభుత్వం నియమించారు.
అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఐదుగురు సహాయ సిబ్బందిని కేటాయించారు. తిరుచానూరు మార్కెట్ కమిటీకి చెందిన కొందరు ఉద్యోగులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, టీటీడీ గోదాములు అండ్ కొనుగోళ్ల విభాగంలో విధులు నిర్వర్తించిన కొందరికి మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది.
కల్తీ నెయ్యి టెండర్ల పర్యవేక్షణలో లోపాలు, నిబంధనల సడలింపులు, నాణ్యత పరీక్షల్లో వైఫల్యాలు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చేశారా అనే అంశాలపై కమిషన్ దర్యాప్తు చేయనుంది. కల్తీ నెయ్యి కొనుగోళ్లలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదనిపై ఏకసభ్య కమిషన్ సిఫార్సులు చేయనుంది. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను కమిషన్ 45 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంది.
