టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన సెకండ్ ఇన్నింగ్స్ను స్పీడ్ అప్ చేశారు. చాలా కాలం తర్వాత ఆమె నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) మే 15న విడుదలకు సిద్ధమవుతోంది.నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. దీంతో పాటు రాజ్ & డీకే దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండం’ అనే వెబ్ సిరీస్లో కూడా సమంత నటిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సామ్, తన వ్యక్తిగత విషయాలతో పాటు సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Naresh-Pavitra: ఆమె వచ్చాకే నాన్న అలా మారాడు.. నరేష్ పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..
ఇన్స్టాగ్రామ్ ‘AMA’ సెషన్లో భాగంగా నెగెటివ్ కామెంట్లను ఎలా ఎదుర్కొంటారు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత తనదైన శైలిలో స్పందించారు.. ‘ప్రశంసలు నన్ను పొంగిపోయేలా చేయవు, అలాగని ట్రోల్స్ నన్ను కుంగదీయవు. కానీ నా డిజిటల్ స్పేస్లోకి నెగెటివిటీని తీసుకొస్తే మాత్రం సహించను. నా ఇంటిని నేను ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో, నా సోషల్ మీడియా పేజీని కూడా అంతే క్లీన్గా ఉంచుకుంటాను. ఎవరినైనా బ్లాక్ చేశానంటే వారు నన్ను బాధపెట్టారని కాదు, నా ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థం’ అని సమంత ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ సమయం వృధా చేయడం తనను కూడా భయపెడుతోందని ఆమె అంగీకరించారు. ఆ ఏకాగ్రతను తిరిగి పొందేందుకు పుస్తకాలు చదవడం, పాడ్కాస్ట్లు వినడం వంటి నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఒత్తిడి లేదా బాధ కలిగినప్పుడు తాను ధ్యానం (Meditation) చేస్తానని, ఏదైనా ఫన్నీ విషయం ఎదురైతే కిందపడి మరీ నవ్వుతానని తన మనసులోని మాటను పంచుకున్నారు.
