NTV Telugu Site icon

RS Praveen Kumar : శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

Rs Praveen

Rs Praveen

శ్రీధర్‌రెడ్డి హత్య నిందితులను అరెస్ట్‌ చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని తెలంగాణ డీజీపీని బీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. ఇటీవల వనపర్తి జిల్లా లక్ష్మిపల్లిలో హత్యకు గురైన శ్రీధర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌రెడ్డిలు డీజేపీని కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హత్య కు గురైన శ్రీధర్ రెడ్డి హత్య పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ కి ఫిర్యాదు చేసామన్నారు. హత్య జరిగి నాలుగు రోజులు అవుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటి వరకు ఏ కేసులో ఎవ్వరిని అరెస్ట్ చేయలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాన నిందితుడు జూపల్లి కృష్ణా రావు ఇంట్లో ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టాడని, ముఖ్యమంత్రి ఈ రాష్టానికి హోమ్ మంత్రి గా ఉన్నాడని, శ్రీధర్ రెడ్డి హత్య కేసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీ ని కోరామన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. వారం రోజుల్లో ఈ కేసు లో పై న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.