Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ ద్వారా ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఒక చెరిగిపోని రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్గా హిట్మ్యాన్ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై ఏడో ఓవర్లో సిక్సర్ కొట్టడం ద్వారా ఈ జట్టుపై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు. గతంలో ఎంఎస్ ధోనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 50 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు రోహిత్ మాహీని అధిగమించి ఈ జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్పై 61 సిక్సర్లు, కేకేఆర్పై 54 సిక్సర్లతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాడు. అలాగే 48 సిక్సర్లతో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు.
మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడానికి కేవలం అడుగు దూరంలో నిలిచాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ మరో 11 పరుగులు (మొత్తం 46) చేసి ఉంటే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్లో 6,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించేవాడు. ప్రస్తుతం అతను ముంబై తరఫున ఆడిన 229 మ్యాచ్లలో 5,989 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ రాబోయే మ్యాచుల్లో ఈ మైలురాయిని అధిగమించడం ఖాయం. ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రోహిట్ ముంబై జట్టులో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నాడు.
READ ALSO: Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!
