Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా, రేషన్ కార్డు వినియోగదారులందరికీ ‘ఈ-కేవైసీ’ (e-KYC) ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అనర్హులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది లబ్ధిదారులు తమ కార్డులలో వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే లక్షలాది కార్డులు నిబంధనలు పాటించని కారణంగా రద్దు చేశారు. కాబట్టి, ప్రభుత్వం అందించే ఉచిత లేదా రాయితీ బియ్యం, ఇతర సరుకులను నిరంతరాయంగా పొందాలంటే.. ప్రతి కార్డుదారుడు తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానించి.. వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవడం అత్యవసరం.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తి బ్రతికే ఉన్నారా లేదా? ఒకే వ్యక్తికి రెండు చోట్ల కార్డులు ఉన్నాయా? అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది పారదర్శకతను పెంచుతుంది. కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణానికి (FPS) వెళ్లి, అక్కడి డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ (e-PoS) యంత్రం ద్వారా తమ వేలిముద్రలను వేయాలి. దీనినే బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటారు.
Also Read
- Axar Patel: "రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు".. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డునే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ-కేవైసీ అప్డేట్ చేయని కారణంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులను అధికారులు గుర్తించి తొలగించారు.
మీరు ప్రస్తుతం మీ ఊరిలో లేకపోయినా, ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్’ పథకం ద్వారా మీరు ఉన్న చోటే దగ్గరలోని రేషన్ షాపులో కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికీ చాలా మంది రేషన్ కార్డుదారులు తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని.. వారు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు.. వరుసగా మూడు నెలల కంటే ఎక్కువ నెలలు ఆ రేషన్ కార్డు ద్వారా ఎలాంటి రేషన్ తీసుకోకపోతే.. ఆ కార్డులు కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా రద్దైన కార్డులు కూడా దేశ వ్యాప్తంగా చాలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Varanasi OTT Deal : ‘వారణాసి’ ఓటీటీ డీల్ సెట్టా… నెట్ ఫ్లిక్స్ రిప్లై వైరల్
-
NBK 112 : అమరావతిలో అంగరంగ వైభవంగా NBK 112.. క్లాప్ కొట్టిన నారా లోకేష్
-
Axar Patel: “రెండు సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు”.. రిషభ్ పంత్ రీఎంట్రీపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
-
Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!