Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా, రేషన్ కార్డు వినియోగదారులందరికీ ‘ఈ-కేవైసీ’ (e-KYC) ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అనర్హులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది లబ్ధిదారులు తమ కార్డులలో వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే లక్షలాది కార్డులు నిబంధనలు పాటించని కారణంగా రద్దు చేశారు. కాబట్టి, ప్రభుత్వం అందించే ఉచిత లేదా రాయితీ బియ్యం, ఇతర సరుకులను నిరంతరాయంగా పొందాలంటే.. ప్రతి కార్డుదారుడు తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానించి.. వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవడం అత్యవసరం.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తి బ్రతికే ఉన్నారా లేదా? ఒకే వ్యక్తికి రెండు చోట్ల కార్డులు ఉన్నాయా? అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది పారదర్శకతను పెంచుతుంది. కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణానికి (FPS) వెళ్లి, అక్కడి డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ (e-PoS) యంత్రం ద్వారా తమ వేలిముద్రలను వేయాలి. దీనినే బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటారు.
Also Read
ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డునే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ-కేవైసీ అప్డేట్ చేయని కారణంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులను అధికారులు గుర్తించి తొలగించారు.
మీరు ప్రస్తుతం మీ ఊరిలో లేకపోయినా, ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్’ పథకం ద్వారా మీరు ఉన్న చోటే దగ్గరలోని రేషన్ షాపులో కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికీ చాలా మంది రేషన్ కార్డుదారులు తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని.. వారు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు.. వరుసగా మూడు నెలల కంటే ఎక్కువ నెలలు ఆ రేషన్ కార్డు ద్వారా ఎలాంటి రేషన్ తీసుకోకపోతే.. ఆ కార్డులు కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా రద్దైన కార్డులు కూడా దేశ వ్యాప్తంగా చాలా ఉన్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!