NTV Telugu Site icon

Rashmika Mandanna : హాట్ ఫోటో షేర్ చేసి నెట్టింట అలజడి సృష్టిస్తున్న రష్మిక..

Whatsapp Image 2023 10 17 At 11.45.17 Pm

Whatsapp Image 2023 10 17 At 11.45.17 Pm

రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా మారిపోయింది.తాజాగా ఈ భామ షేర్ చేసిన బోల్డ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన  ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది.స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్ ఉన్న రష్మిక మందన్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బోల్డ్ లుక్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మీ… ”ఇది సరిగ్గా ఏడాది క్రితం తీసిన ఫోటో. ఆమె ప్రమేయం లేకుండా మా టీమ్ క్లిక్ చేశారు. అలాగే చనువు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాము” అని కామెంట్ కూడా చేసింది. ఇదిలా ఉంటే రష్మిక కెరీర్ ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తుంది.ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది.ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో రష్మిక నటించింది. ఇటీవల విడుదలైన సాంగ్ ఆద్యంతం రొమాన్స్ తో కూడి ఉంది. ముద్దు సన్నివేశాల్లో అభ్యంతరం లేకుండా నటించేందుకు రష్మిక రూ. 20 లక్షలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందంటూ ప్రచారం కూడా జరుగుతుంది.

అయితే ఈ భామ నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ ప్రకటించింది. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఛలో మూవీతో రష్మిక స్టార్ హీరోయిన్ గా మారింది.ఆ తరువాత అదే డైరెక్టర్ తో నితిన్ సరసన భీష్మ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.అలాగే ఈ భామ రైన్ బో అనే టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కుతుంది.ఇక రష్మిక ఖాతాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 టీజర్ కి హిందీలో భారీ రెస్పాన్స్ వచ్చింది.. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది.