రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నాని తో ప్రేమాయణం సాగించింది.. వాళ్ల జంట ఎప్పుడు వార్తల్లో నిలిచేది కూడా..
ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కెర్లు కొడుతూనే ఉంటాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ తో ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టింది.. ఆ తర్వాత పబ్లిక్ గానే ఇద్దరు కలిసి బయట తిరుగుతూ కెమెరాలకు చిక్కుతూ వచ్చారు.. పెళ్లి పై వార్తలు రోజు వినిపించేవి.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకో బోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..
వీరి పెళ్లి ఫిబ్రవరి 22న గోవాలో కుటుంబ సభ్యులు, బాగా దగ్గర స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరి పెళ్లి జరగనుందని టాక్.. అంతేకాదు ఈ పెళ్లి ఎప్పటికి గుర్తుండి పోవాలని ప్రముఖ ఫోటో గ్రాఫర్ విశాల్ పంజాబీని నియమించారట.. ప్రముఖులు పెళ్లిళ్లను ఇతనే షూట్ చేశారు. అంతేకాదు వీరిద్దరి పై స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. మొత్తానికి గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయ్యినట్లు ఉంది.. మరి ఈ పెళ్లికి అతిధులుగా ఎవరిని పిలుస్తారో తెలియాల్సి ఉంది.. ఇక ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం.. మరి దీనిపై ఎప్పుడు ప్రకటన ఇస్తుందో చూడాలి మరి.. ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది..