Site icon NTV Telugu

Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్

New Project (79)

New Project (79)

Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో వాషింగ్టన్‌లో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని పాకిస్తాన్, భారతదేశం మధ్య సంబంధాల గురించి ఒక ప్రశ్న అడిగారు. పాక్‌తో భారత్‌ సంబంధాలు ఎలా ఉన్నాయని, కాశ్మీర్‌ సమస్య కారణంగా రెండు దేశాలు కలిసి రాలేకపోతున్నాయా? ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాదు, అలా కాదు, పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని అన్నారు. పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు. ఆ దేశం దీనిని కొనసాగించినంత కాలం రెండు దేశాల మధ్య సంబంధాల మధ్య సమస్యలు ఉంటాయన్నారు.

Read Also:Semicon India 2024: నేడు సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

బంగ్లాదేశ్ గురించి మీరు ఏమి చెప్పారు?
బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు ఈ నాటివి కావు.. ఎప్పటి నుంచో ఉన్నవే. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని, కొంతమంది ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లను తగులబెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లోని తీవ్రవాద అంశాల గురించి భారతదేశంలో ఆందోళనలు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని.. ప్రస్తుత ప్రభుత్వంతో లేదా మరేదైనా ప్రభుత్వంతో మేము బలమైన సంబంధాలను కొనసాగించగలమని నేను విశ్వసిస్తున్నానన్నారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి నెలకొంది. దేశంలో తిరుగుబాటు జరిగింది. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మహ్మద్ యూనస్ నేతృత్వంలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Read Also:Rohit Sharma: మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్‌ శర్మ కన్ను! తొలి కెప్టెన్‌గా..

Exit mobile version