Site icon NTV Telugu

RRR : జగన్‌పై కేటీఆర్‌ మిత్ర ధర్మాన్ని పాటించారు

Raghu Rama Krishna Raju

Raghu Rama Krishna Raju

వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు రఘురామకృష్ణం రాజు. ఇదిలా ఉంటే.. ఏపీలో వైసీపీ, కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ కేటీర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ చేసిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు. మీకు మీరే మంచివారంటూ.. సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా కేటీఆర్‌? అంటూ ప్రశ్నించారు సత్యకుమార్‌.

Exit mobile version