Site icon NTV Telugu

Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

Raghav Chadha

Raghav Chadha

Raghav Chadha: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రస్తావించే ప్రతి అంశం సగటు భారతీయుడు ఆలోచనలకూ చాలా దెగ్గరగా ఉంటుంది. ఇప్పటి అనేక అంశాలపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక తాజగా ఆయన రోజువారీ డేటా లిమిట్స్‌తో వచ్చే మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై చర్చించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా టెలికాం సంస్థలు 1.5GB, 2GB లేదా 3GB వంటి రోజువారీ డేటా పరిమితులను అందిస్తున్నాయి. అయితే వినియోగదారులు పూర్తిగా డేటా ఉపయోగించకపోతే, మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత పూర్తిగా రద్దవుతోంది. ఉదాహరణకు, 2GB ప్లాన్ తీసుకున్న వినియోగదారు 1.5GB మాత్రమే వాడితే, మిగిలిన 0.5GB డేటా పూర్తిగా పోతుంది. దీనికి రిఫండ్ లేదా రోల్‌ఓవర్ వంటి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

ఈ విధానాన్ని విమర్శించిన రాఘవ్ చద్దా.. “డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా ఎందుకు నష్టపోవాలి?” అని ప్రశ్నించారు. వినియోగదారులకు న్యాయం జరగాలంటే కొన్ని మార్పులు అవసరమని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ఆయన పలు డిమాండ్లు ప్రభుత్వం ముందర ఉంచారు.

డేటా రోల్‌ఓవర్ విధానం:
వాడని డేటా తదుపరి రోజుకు తరలేలా అన్ని టెలికాం కంపెనీలు అవకాశం ఇవ్వాలని కోరారు. రోజు ముగిసిన వెంటనే డేటా తొలగించకుండా, తర్వాతి రోజుకి జోడించాలి అన్నారు.

వాడని డేటాకు సర్దుబాటు:
వినియోగదారులు నిరంతరం తక్కువ డేటా వాడితే, మిగిలిన డేటా విలువను తదుపరి రీచార్జ్‌లో తగ్గింపు రూపంలో ఇవ్వాలని సూచించారు.

CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!

డేటా ట్రాన్స్‌ఫర్ సౌకర్యం:
వాడని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపుకునే విధానం ఉండాలని పేర్కొన్నారు. డేటాను వినియోగదారుల “డిజిటల్ ఆస్తి”గా పరిగణించాలి అన్నారు.

డిజిటల్ ఇండియాలో కీలక అంశం:
డిజిటల్ యుగంలో డేటా అత్యంత కీలకమైన వనరుగా మారింది. ఇలాంటి సమయంలో వినియోగదారులు చెల్లించిన డేటా పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉండాలని చద్దా అభిప్రాయపడ్డారు.

Exit mobile version