Puri Jagannadh : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ కొనసాగారు.టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందించాడు.అయితే ఇప్పుడు పూరికి టైం అస్సలు కలిసి రావడం లేదు.చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన పూరి జగన్నాధ్ ఆ వెంటనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” సినిమాను తెరకెక్కించాడు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా కొట్టిన దెబ్బకు పూరి జగన్నాధ్ కు మెగా ఫోన్ పట్టడానికి ఏడాది సమయం పట్టింది.
Read Also :Kalki 2898 AD : మూడు ప్రపంచాల చుట్టూ కల్కి కథ.. స్పెషల్ పోస్టర్స్ వైరల్..
లైగర్ రిలీజ్ కు ముందే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో పూరి “జనగణమన” సినిమా మొదలు పెట్టాడు.లైగర్ ప్లాప్ తో నిర్మాతలు వెనుకడుగు వేశారు.దీనితో పూరి డ్రీం ప్రాజెక్ట్ ఆగిపోయింది.ప్రస్తుతం పూరి జగన్నాధ్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమా తరువాత పూరి భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఇందులో నటించే హీరోల వివరాలు మాత్రం తెలియలేదు.ఈ మల్టీ స్టారర్ లో స్టార్స్ నటించాలంటే డబుల్ ఇస్మార్ట్ అద్భుత విజయం సాధించాలి.దీనితో పూరి కెరీర్ కు డబుల్ ఇస్మార్ట్ ఎంతో కీలకం.