Site icon NTV Telugu

Pulwama Attack 2019: జవాన్ల త్యాగం.. భారత చరిత్రలో చెరగని ముద్ర.. 40 మంది పుల్వామా అమరుల పేర్లు ఇవే..

Jawan

Jawan

Pulwama Attack 2019: ఫిబ్రవరి 14, 2019 దేశం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. భారతీయులు 40 మంది సైనికులను కోల్పోయింది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్‌పుర (అవంతిపురా సమీపం)లో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, శత్రు మూఖలను కఠినంగా శిక్షించాలని నినాదాలతో మార్మోగింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏటా బ్లాక్ డేగా భారతీయులు జరుపుకొంటారు. జవాన్లకు నివాళులర్పిస్తారు. వాస్తవానికి ఏటా ఫిబ్రవరి 14 రోజున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. కానీ భారత్‌లో మాత్రం ఇది బ్లాక్ డే. 2019 నుంచి ఫిబ్రవరి 14ను పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకునే రోజుగా గుర్తిస్తున్నారు. ప్రేయసికి ఇచ్చే పూలకు బదులుగా.. వీరమరణం పొందిన జవాన్లు వద్ద పుష్పాలు, కొవ్వొత్తులు ఉంచి నివాళి తెలియజేస్తున్నారు. పుల్వామా ఎలా జరిగింది? ఆ దాడిలో మరణించిన జవాన్ల పేర్లు, తదితర వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

READ MORE: T20 World Cup 2026: ఎవరు ధైర్యం చేస్తారో చూడాలి.. పాక్ స్పిన్నర్ తారిక్ బౌలింగ్పై అశ్విన్ కామెంట్స్ వైరల్!

ఏడేళ్ల క్రితం ఇదేరోజున సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. ఆ రోజు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 2,547 మంది సిబ్బంది 60కి పైగా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. సైనికులు ఉన్న ఈ కాన్వాయ్‌లో అధికంగా బస్సులు ఉన్నాయి. కాన్వాయ్‌ పుల్వామా వద్దకు చేరుకోగానే అటువైపు నుంచి వచ్చిన ఓ కారు కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొంది. బస్సును ఢీకొన్న ఆ కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీంతో వెంటనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందారు. అయితే.. ఈ దాడికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ బాధ్యత వహించింది. తామే చంపేశామని ప్రకటించింది. ఈ ఘటన భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. అమాయకంగా విధులు నిర్వర్తిస్తున్న జవాన్లపై ఇలాంటి దాడి జరగడం అందరినీ కలిచివేసింది. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు కఠిన చర్యలు అవలంబించింది. ఫలితంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

READ MORE: Ranveer Singh : సల్మాన్ తర్వాత ఇప్పుడు రణవీర్? గ్యాంగ్ వార్నింగ్‌తో వణికిపోతున్న బాలీవుడ్!

2019, ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి ప్రవేశించి వైమానిక దాడులతో పాక్‌లోని ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో ఫిబ్రవరి 27న పాకిస్థాన్ వైమానిక దళం జమ్మూ, కశ్మీర్‌లోకి చొరబడి భారతదేశంపై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానం ‘మిగ్-21’ పాకిస్థాన్ సైన్యం దాడికి గురై, అక్కడే పడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైనికులు ‘మిగ్-21’ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకున్నారు. 2019, మార్చి ఒకటిన అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడి మేరకు పాకిస్థాన్ సైన్యం అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్‌ అప్పటివరకూ పాక్‌తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా పాకిస్తాన్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు మనీలాండరింగ్‌పై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్)ను కూడా భారత ప్రభుత్వం కోరింది.

  1. హెడ్ ​​కానిస్టేబుల్ నసీర్ అహ్మద్ (జమ్మూ కశ్మీర్)
  2. కానిస్టేబుల్ సుఖ్జీందర్ సింగ్ (పంజాబ్)
  3. హెడ్ ​​కానిస్టేబుల్ జైమల్ సింగ్ (పంజాబ్)
  4. కానిస్టేబుల్ రోహితాష్ లాంబా (రాజస్థాన్)
  5. కానిస్టేబుల్ తిలక్ రాజ్ (హిమాచల్ ప్రదేశ్)
  6. హెడ్ ​​కానిస్టేబుల్ విజయ్ సోరెంగ్ (జార్ఖండ్)
  7. కానిస్టేబుల్ వసంత కుమార్ వివి (కేరళ)
  8. కానిస్టేబుల్ సుబ్రమణ్యం జి (తమిళనాడు)
  9. కానిస్టేబుల్ మనోజ కుమార్ బెహెరా (ఒడిశా)
  10. కానిస్టేబుల్ GD గురు హెచ్ (కర్ణాటక)
  11. హెడ్ ​​కానిస్టేబుల్ నారాయణ్ లాల్ గుర్జార్ (రాజస్థాన్)
  12. కానిస్టేబుల్ మహేష్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)
  13. కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ (ఉత్తరప్రదేశ్)
  14. హెడ్ ​​కానిస్టేబుల్ హేమ్‌రాజ్ మీనా (రాజస్థాన్)
  15. హెడ్ ​​కానిస్టేబుల్ పీకే సాహూ (ఒడిశా)
  16. కానిస్టేబుల్ రమేష్ యాదవ్ (ఉత్తరప్రదేశ్)
  17. హెడ్ ​​కానిస్టేబుల్ సంజయ్ రాజ్‌పుత్ (మహారాష్ట్ర)
  18. కానిస్టేబుల్ కౌశల్ కుమార్ రావత్ (ఉత్తరప్రదేశ్)
  19. కానిస్టేబుల్ ప్రదీప్ సింగ్ (ఉత్తరప్రదేశ్)
  20. కానిస్టేబుల్ శ్యామ్ బాబు (ఉత్తరప్రదేశ్)
  21. కానిస్టేబుల్ అజిత్ కుమార్ ఆజాద్ (ఉత్తరప్రదేశ్)
  22. కానిస్టేబుల్ మణిందర్ సింగ్ అత్రి (పంజాబ్)
  23. హెడ్ ​​కానిస్టేబుల్ బబ్లూ సంత్రా (పశ్చిమ బెంగాల్)
  24. కానిస్టేబుల్ అశ్వని కుమార్ కావోచి (మధ్యప్రదేశ్)
  25. కానిస్టేబుల్ రాథోడ్ నితిన్ శివాజీ (మహారాష్ట్ర)
  26. కానిస్టేబుల్ భగీరథ్ సింగ్ (రాజస్థాన్)
  27. కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ (ఉత్తరాఖండ్)
  28. హెడ్ ​​కానిస్టేబుల్ అవధేష్ కుమార్ యాదవ్ (ఉత్తర ప్రదేశ్)
  29. కానిస్టేబుల్ రతన్ కుమార్ ఠాకూర్ (బీహార్)
  30. కానిస్టేబుల్ పంకజ్ కుమార్ త్రిపాఠి (ఉత్తరప్రదేశ్)
  31. కానిస్టేబుల్ జీత్ రామ్ (రాజస్థాన్)
  32. కానిస్టేబుల్ అమిత్ కుమార్ (ఉత్తర ప్రదేశ్)
  33. కానిస్టేబుల్ విజయ్ Kr. మౌర్య (ఉత్తర ప్రదేశ్)
  34. కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్ (పంజాబ్)
  35. హెడ్ ​​కానిస్టేబుల్ మణేశ్వర్ సుమతారి (అస్సాం)
  36. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ లాల్ (ఉత్తరాఖండ్)
  37. హెడ్ ​​కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సిన్హా (బీహార్)
  38. హెడ్ ​​కానిస్టేబుల్ రామ్ వకీల్ (ఉత్తరప్రదేశ్)
  39. కానిస్టేబుల్ సుదీప్ బిస్వాస్ (పశ్చిమ బెంగాల్)
  40. కానిస్టేబుల్ శివచంద్రన్ (తమిళనాడు)
Exit mobile version