Site icon NTV Telugu

PM-KISAN: రైతులకు శుభవార్త.. సోమవారం బ్యాంకు ఖాతాల్లో జమకానున్న డబ్బులు

Pm Kisan

Pm Kisan

PM-KISAN: అన్నదాతల ఖాతాల్లోకి రూ.16,800 కోట్ల రూపాయల నిధులు వచ్చి చేరనున్నాయి. పీఎం కిసాన్‌ యోజనలో భాగంగా ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం రబీ పంటల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద ఎనిమిది కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.16,800 కోట్ల విలువైన 13వ విడత ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.

ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడింది కానీ డిసెంబర్ 2018 నుంచే అమలులోకి వచ్చింది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని 13వ విడతను విడుదల చేస్తారని ఆదివారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో కూడిన లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహుజా కూడా హాజరుకానున్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద 11వ, 12వ విడతలు మే, అక్టోబర్ 2022లో విడుదల చేయబడ్డాయి.

Read Also: Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్

పీఎం-కిసాన్ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించిందని, ఈ తాజా విడత వారి ఆదాయాన్ని మరింత పెంచుతుందని, వ్యవసాయ రంగ వృద్ధికి దోహదపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు, ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద రూ.2.25 లక్షల కోట్లకు పైగా నిధులు పంపిణీ చేయబడ్డాయి. ముఖ్యంగా, కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఈ నిరుపేద రైతులను ఆదుకోవడానికి రూ.1.75 లక్షల కోట్లు బహుళ వాయిదాలలో పంపిణీ చేయబడ్డాయి. సమిష్టిగా రూ.53,600 కోట్ల నిధులను పొందిన మూడు కోట్ల మంది మహిళా లబ్ధిదారులకు కూడా ఈ పథకం ప్రయోజనం చేకూర్చింది. ఈ చొరవ గ్రామీణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. రైతులకు రుణ పరిమితులను తగ్గించింది. వ్యవసాయ పెట్టుబడులను పెంచింది. ఇది రైతుల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచింది. ఇది మరింత ఉత్పాదక పెట్టుబడులకు దారితీసింది.

Exit mobile version