NTV Telugu Site icon

PM Modi: నేడు గిరిజనుల కోసం ప్రధాని మోడీ కొత్త పథకం..

Pm Modi

Pm Modi

భారతదేశంలోని గిరిజనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పీఎం జన్‌మన్ పథకం(ఆదివాసుల అభివృద్ధి పథకం) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నారు. తొలి విడతలో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వర్చువల్ గా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని చెంచెలతో సమావేశమై మాట్లాడనున్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నాగర్ కర్నూల్‌, వికారాబాద్ జిల్లాల్లో గిరిజనులు లబ్ధిపొందనున్నారు.

Read Also: VC Sajjanar: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ రికార్డు కలెక్షన్లు.. ఒక్క రోజే 52.78 లక్షల మంది జర్నీ..

ఈ పథకం అమలుతో 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసి తెగలను గుర్తించి 24,104 కోట్లు కేటాయించగా, లక్ష ఇండ్లను నిర్మించనున్నారు. ఆదివాసీ గురుకుల విద్యాలయం(పీటీజీ)లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, గిరిజనులతో ప్రధాని మాట్లాడేందుకు డిజిటల్‌ తెర ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా పరిధిలోని అన్ని పెంటల నుంచి చెంచులు, చెంచు ప్రజాప్రతినిధులు మొత్తం 800 మందికి ఆహ్వానం పంపించారు. ఇక, చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం జన్‌మన్‌ పథకం అమలుపై సమావేశంలో వారికి మోడీ వివరించనున్నారు. ఈ పథకంలో భాగంగా పాఠశాలల నిర్మాణం, గృహాల నిర్మాణం, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్‌ ఏర్పాటుతో పాటు అంశాలపై గిరిజనులతో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతారని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.